E-PAPER

రేవంత్ తో భేటీ, పార్టీ మార్పు పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం క్లారిటీ..!!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

రేవంత్ తో భేటీ, పార్టీ మార్పు పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం క్లారిటీ..!!

04 Dec 2023, 6:46 pm MANASAKSHIGONTHUKA

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ తొలి ఎత్తుగడ విఫలమైంది. ఫలితాలు వచ్చిన కొద్ది సేపటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ఒక ఫొటో వైరల్ అయింది. పొంగులేటితో కలిసి రేవంత్, కోమటిరెడ్డి వద్దకు తెల్లం వెళ్లినట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు దీని పైన తెల్లం వెంకటరావు స్పష్టత ఇచ్చారు. అది గతంలో కలిసిన ఫొటో అని..తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.

 

పార్టీ మార్పు ప్రచారం తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. 64 సీట్లను గెలుచుకుంది. దీంతో, గతంలో కేసీఆర్ అనుసరించిన విధానం అమలుకు సిద్దమైందనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే ఒక్క సీటు గెలిచింది.ఎస్టీ రిజర్వుడ్ అయిన భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున బరిలో దిగిన తెల్లం కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై 5719 ఓట్ల తేడాతో గెలుపొందారు. తెల్లం వెంకట రావు ఫలితాలు వచ్చిన కొద్ది సేపటికే జిల్లాకు చెందిన నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి రేవంత్ వద్దకు వచ్చినట్లు ఫొటో ఒకటి బయటకు వచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలిచినా..కాంగ్రెస్ కు మద్దతు నిలుస్తారనే ప్రచారం సాగింది. దీని పైన ఇప్పుడు తెల్లం వెంకట్రావు స్పష్టత ఇచ్చారు.

 

BRs MLA Tellam Venkata Rao Gives clarity on His meeting with Revanth and Joining in Congress

వెంకట్రావు క్లారిటీ తాను ఆదివారం మొత్తం కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నానని వెల్లడించారు. తాను గతంలో పొంగులేటితో కలిసి రేవంత్ వద్దకు వెళ్లిన ఫొటో ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారని వివరించారు. తాను భద్రాచలం వదిలి అసలు హైదరాబాద్ వెళ్లలేదని చెప్పారు. అసలు రేవంత్ - కోమటిరెడ్డి ఇప్పటి వరకు ఫలితాల తరువాత కలవదేని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని..ఇక, తానెక్కడ వాళ్లతో కలుస్తానని ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని..భద్రాచలం ప్రజలకు ఇచ్చిన ప్రాజెక్టులు...స్థానిక అంశాల పైన ప్రభుత్వంతో పోరాటం చేస్తానని స్పష్టం చేసారు. తాను ఎవరినీ కలవలేదని తేల్చి చెప్పారు.

 

కేసీఆర్ తో భేటీ తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే..ప్రజలు గెలిపించారని..ఆ పార్టీని తాను వీడేది లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మెజార్టీ కంటే నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువగా ఉండటంతో తమతో కలిసి వచ్చే వారి కోసం అన్వేషణ ప్రారంభించిందనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఈ సాయంత్రం ఫాం హౌస్ లో గెలిచిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇప్పటికే కేటీఆర్ వారితో భేటీ అయ్యారు. అధికారం కోల్పోయినా...తిరిగి ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దాని పైన కేసీఆర్ కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు.

Generating image…

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ తొలి ఎత్తుగడ విఫలమైంది. ఫలితాలు వచ్చిన కొద్ది సేపటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ఒక ఫొటో వైరల్ అయింది. పొంగులేటితో కలిసి రేవంత్, కోమటిరెడ్డి వద్దకు తెల్లం వెళ్లినట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు దీని పైన తెల్లం వెంకటరావు స్పష్టత ఇచ్చారు. అది గతంలో కలిసిన ఫొటో అని..తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.

 

పార్టీ మార్పు ప్రచారం తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. 64 సీట్లను గెలుచుకుంది. దీంతో, గతంలో కేసీఆర్ అనుసరించిన విధానం అమలుకు సిద్దమైందనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే ఒక్క సీటు గెలిచింది.ఎస్టీ రిజర్వుడ్ అయిన భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున బరిలో దిగిన తెల్లం కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై 5719 ఓట్ల తేడాతో గెలుపొందారు. తెల్లం వెంకట రావు ఫలితాలు వచ్చిన కొద్ది సేపటికే జిల్లాకు చెందిన నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి రేవంత్ వద్దకు వచ్చినట్లు ఫొటో ఒకటి బయటకు వచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలిచినా..కాంగ్రెస్ కు మద్దతు నిలుస్తారనే ప్రచారం సాగింది. దీని పైన ఇప్పుడు తెల్లం వెంకట్రావు స్పష్టత ఇచ్చారు.

 

BRs MLA Tellam Venkata Rao Gives clarity on His meeting with Revanth and Joining in Congress

వెంకట్రావు క్లారిటీ తాను ఆదివారం మొత్తం కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నానని వెల్లడించారు. తాను గతంలో పొంగులేటితో కలిసి రేవంత్ వద్దకు వెళ్లిన ఫొటో ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారని వివరించారు. తాను భద్రాచలం వదిలి అసలు హైదరాబాద్ వెళ్లలేదని చెప్పారు. అసలు రేవంత్ – కోమటిరెడ్డి ఇప్పటి వరకు ఫలితాల తరువాత కలవదేని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని..ఇక, తానెక్కడ వాళ్లతో కలుస్తానని ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని..భద్రాచలం ప్రజలకు ఇచ్చిన ప్రాజెక్టులు…స్థానిక అంశాల పైన ప్రభుత్వంతో పోరాటం చేస్తానని స్పష్టం చేసారు. తాను ఎవరినీ కలవలేదని తేల్చి చెప్పారు.

 

కేసీఆర్ తో భేటీ తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే..ప్రజలు గెలిపించారని..ఆ పార్టీని తాను వీడేది లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మెజార్టీ కంటే నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువగా ఉండటంతో తమతో కలిసి వచ్చే వారి కోసం అన్వేషణ ప్రారంభించిందనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఈ సాయంత్రం ఫాం హౌస్ లో గెలిచిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇప్పటికే కేటీఆర్ వారితో భేటీ అయ్యారు. అధికారం కోల్పోయినా…తిరిగి ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దాని పైన కేసీఆర్ కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు.

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!