ఏ అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
ఓబీసీ సెల్ జనగామ జిల్లా వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్ డిమాండ్
మన సాక్షి జనగామ: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ తెలంగాణ భవన్లో నిర్వహించిన మాక్ అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకాకపోవడంపై ఓబీసీ సెల్ జనగామ జిల్లా వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్ విమర్శలు చేశారు.ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం సరికాదని ఆయన అన్నారు. అసెంబ్లీకి హాజరు కాకుండా ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ను నిరసిస్తూ నిర్వహించిన మాక్ అసెంబ్లీకి సైతం కేసీఆర్ గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారిందన్నారు. మాక్ అసెంబ్లీకి జహీరాబాద్ ఎమ్మెల్యే కె. మాణిక్యరావు స్పీకర్గా వ్యవహరించారు. అసెంబ్లీలో, మాక్ అసెంబ్లీలో దళితులు స్పీకర్ గా ఉన్నారని వారి ముందు కూర్చొని అధ్యక్ష అని అన్నాల్సి వస్తుందని కెసిఆర్ రెండూ అసెంబ్లీలో కూడా హాజరుకాలేదనిఅన్నారు.అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలపై ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని చెరుకూరి శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.









