హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి పోలీసులతో గొడవ పడ్డారని ఓ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవలే ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేస్తూ తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రజలను బెదిరించారు. ఆయన ప్రవర్తనతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్ ఆయనపై కేసు నమోదు చేసింది.
Post Views: 2










