మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన పంబాల లక్ష్మి మృతి చెందడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సామాజికవేత్త పోతుల రాములు యాదవ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియల నిర్వహణ కోసం తన వంతు సహాయంగా రూ.5,000 నగదు అందజేశారు.ఈ సందర్భంగా పోతుల రాములు యాదవ్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. గ్రామంలో ఎవరికైనా ఇలాంటి కష్టసమయాలు ఎదురైతే తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పంబాల రామ, జయలక్ష్మి, సోనీ, రామ లాస్య, మంజుల, కనకలక్ష్మి, రేణుక, సుశీల, లావణ్య, యాదయ్య, గుండెం సిద్ధులు, నీల పాపయ్య, పంబాల నర్సింహులు, పంబాల శ్రీనివాస్, పంబాల కనకయ్య, పంబాల కర్ణాకర్, పంబాల గణేష్, పంబాల సందీప్, పంబాల అఖిల్, పంబాల శివ, పంబాల పవన్, నల్ల సత్తయ్య, నీల అంజయ్య, గొడుగు కర్ణాకర్, నల్ల రాజు, లక్ష్మయ్య తదితరులు పాల్గొని మృతురాలికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.










