మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం, సాల్వాపూర్ గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో సాల్వాపూర్ గ్రామ సర్పంచ్ మిద్దెల శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని వాటర్ ట్యాంక్ను శుభ్రం చేయించారు.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ట్యాంక్లో పేరుకుపోయిన మురికి, చెత్తను పూర్తిగా తొలగించి శుభ్రపరిచే పనులు చేపట్టారు.తాగునీటి ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ఈ చర్యలు ఎంతో ఉపయోగపడతాయని సర్పంచ్ తెలిపారు.గ్రామ ప్రజల ఆరోగ్యం తమకు అత్యంత ముఖ్యమని, తాగునీటి సరఫరాలో నాణ్యతకు ఎలాంటి రాజీ ఉండదని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు తాగునీటి వనరులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.గ్రామస్తులు సర్పంచ్ మిద్దెల శ్రీధర్ గౌడ్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ప్రజారోగ్యంపై చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు.










