మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం,లింగంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన చింతల అంజయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, గ్రామస్తులు ముందుకు వచ్చారు. సర్పంచ్ మద్దికుంట రాధ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఫోన్ చేసి సమాచారం తెలియజేసిన వెంటనే స్పందించి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. లింగంపల్లి గ్రామ సర్పంచ్ మద్దికుంట రాధ రూ.2,000, గ్రామ శాఖ అధ్యక్షుడు రాజిరెడ్డి రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం చేశారు.అంతేకాకుండా గ్రామంలోని వాట్సాప్ గ్రూపుల ద్వారా గ్రామస్తులు తమకు తోచిన మేరకు విరాళాలు అందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామస్తులు అందించిన సహకారం నిరుపేద కుటుంబానికి కొంత ఊరటనిచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ నవీన్, చిట్యాల ఉప సర్పంచ్ కనకయ్య ,వార్డు మెంబర్లు, నాయకులు ,తదితరులు పాల్గొని నివాళులర్పించారు










