E-PAPER

డిజిటల్ సర్వే పూర్తయ్యే వరకు సర్వేలకు అనుమతి ఇవ్వొద్దు: అల్లాదుర్గం వెంకటేశ్వర్లు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

డిజిటల్ సర్వే పూర్తయ్యే వరకు సర్వేలకు అనుమతి ఇవ్వొద్దు: అల్లాదుర్గం వెంకటేశ్వర్లు

30 Jul 2026, 11:18 am MANASAKSHIGONTHUKA

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలండిజిటల్ సర్వే పూర్తయ్యే వరకు సర్వేలకు అనుమతి ఇవ్వొద్దు అనితెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు అల్లాదుర్గం వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తెలుగుదేశం పార్టీని స్థాపించి, భూ హక్కుల పరిరక్షణకు ఆర్‌ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఆ చట్టం ద్వారా దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.అలాగే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం లేఖ ఇచ్చి తెలంగాణ సాధనకు సహకరించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ధరణి వ్యవస్థ పేరుతో అనుభవ హక్కులకు సంబంధించిన పలు సమస్యలు ఏర్పడ్డాయని, అయితే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చి రైతుల హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.డిజిటల్ భూ సర్వే ప్రక్రియ రైతులకు ఎంతో మేలు చేస్తుందని, గతంలో భూముల విక్రయాల్లో జరిగిన పొరపాట్లు, సర్వే నంబర్లలో ఉన్న లోపాల కారణంగా పేద రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డిజిటల్ సర్వే పూర్తయ్యే వరకు వ్యక్తిగతంగా నిర్వహించే సర్వేలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేశారు.పేద, బడుగు, బలహీన వర్గాల రైతుల భూ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Generating image…

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలండిజిటల్ సర్వే పూర్తయ్యే వరకు సర్వేలకు అనుమతి ఇవ్వొద్దు అనితెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు అల్లాదుర్గం వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తెలుగుదేశం పార్టీని స్థాపించి, భూ హక్కుల పరిరక్షణకు ఆర్‌ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఆ చట్టం ద్వారా దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.అలాగే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం లేఖ ఇచ్చి తెలంగాణ సాధనకు సహకరించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ధరణి వ్యవస్థ పేరుతో అనుభవ హక్కులకు సంబంధించిన పలు సమస్యలు ఏర్పడ్డాయని, అయితే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చి రైతుల హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.డిజిటల్ భూ సర్వే ప్రక్రియ రైతులకు ఎంతో మేలు చేస్తుందని, గతంలో భూముల విక్రయాల్లో జరిగిన పొరపాట్లు, సర్వే నంబర్లలో ఉన్న లోపాల కారణంగా పేద రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డిజిటల్ సర్వే పూర్తయ్యే వరకు వ్యక్తిగతంగా నిర్వహించే సర్వేలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేశారు.పేద, బడుగు, బలహీన వర్గాల రైతుల భూ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!