మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం మెడిసిటీ హాస్పిటల్, ఘనపూర్, మేడ్చల్ వారి ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరం కొనసాగింది. గ్రామస్తులకు ఉచితంగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించారు. అలాగే చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలు, వరిబీజం, బీజకుట్టు, గడ్డలు, కంతులు, థైరాయిడ్ గడ్డలు, గర్భసంచి సంబంధిత వ్యాధులు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, చర్మ వ్యాధులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, వెన్నుపూస సమస్యలు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి నిపుణులు సలహాలు అందించారు.రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పేరబోయిన కళ్యాణి పరుశురాములు, ఉప సర్పంచ్ చింతల కర్ణాకర్, కార్యదర్శి కరుణాకర్, వార్డు సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు










