అధర్యపడకండి అండగా ఉంటా : కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్పూర్, జనగామ,(మనసాక్షి గొంతుక) :
కాంగ్రెస్ కార్యకర్తలు అధర్యపడకండి అండగా ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం స్టేషన్ ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన తాళ్లపెల్లి యాదగిరి, చిల్పూర్ మండలం దేశాయ్ తండా మాజీ సర్పంచ్ భూక్య భాషా నాయక్ అనారోగ్యంతో మరణించగా వారి పార్థివా దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిల్పూరుగుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, స్థానిక సర్పంచులు కోమల, వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ చిల్పూరు మండల అధ్యక్షుడు చిర్ర నాగరాజు గౌడ్, పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 54










