రాఖీ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం అమలు చేయాలి
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఆర్థిక సాయం వెంటనే అమలు చేయాలని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎం.డి. ఫిరోజ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని డిమాండ్ చేశారు.
రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 అందిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలు చేసి ఆడబిడ్డలకు అండగా నిలవాలని అన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా బీడీ కార్మికులు, వృద్ధాప్య పింఛన్లకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని ఎం.డి. ఫిరోజ్ కోరారు. వృద్ధులు, బీడీ కార్మికులు ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి జాప్యం లేకుండా పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలకు రూ.2,500 మహాలక్ష్మి ఆర్థిక సాయం, కొత్త బీడీ కార్మికులు, వృద్ధులకు పింఛన్లు వెంటనే అమలు చేయాలని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎం.డి. ఫిరోజ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు.










